Back to feed
గాల్లో ఉండగా విమానంపై పిడుగు
Kiran Jun 13, 2026 6:17 PM అల్ ఇండియా 19 views1 day ago

కొలంబో నుంచి సిడ్నీ వెళ్తున్న శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానం (యూఎల్606) గాల్లో ఉండగా పిడుగుపాటుకు గురైంది. 207 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్న ఈ విమానం ఇంజిన్ నుంచి మంటలు రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి కొలంబోలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులకు సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది.
Comments
Loading comments...


