Back to feed
ధర్మపురిలో భూసేకరణ దౌర్జన్యం
Swati Chaturvedi May 28, 2026 6:25 AM కరీంనగర్ 10 viewsabout 2 hours ago

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఇండ్లు, భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా పరిహారం నిర్ణయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, సరైన పరిహారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం బ్లూప్రింట్ కూడా ప్రకటించకుండా ఇండ్ల కూల్చివేతకు సిద్ధపడటం దారుణమని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...



