Back to feed
కేరళ డిప్యూటీ స్పీకర్గా షానిమోల్ ఉస్మాన్
Suhani Singh Jun 02, 2026 6:41 AM అల్ ఇండియా 24 views1 day ago

కేరళ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే షానిమోల్ ఉస్మాన్ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థి, ఎల్డీఎఫ్ అభ్యర్థి మహమ్మద్ ముహ్సిన్పై 99 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
గత 35 ఏళ్లలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా, రాష్ట్ర చరిత్రలో నాలుగవ మహిళగా షానిమోల్ ఉస్మాన్ అరుదైన గుర్తింపు పొందారు. ఆమె గెలుపుతో కేరళ అసెంబ్లీలో కొత్త చరిత్ర నమోదైంది.
Comments
Loading comments...


