Back to feed
జడ్జి కుర్చీలో కూర్చుని.. ‘ఆర్డర్ ఆర్డర్’ అన్న మహిళ!
Smriti Jun 14, 2026 6:54 AM అల్ ఇండియా 23 views1 day ago

యూపీలోని వారణాసి జిల్లా కోర్టులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. జడ్జి సెలవులో ఉండగా వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా కోర్టులో జడ్జి కుర్చీలో కూర్చుంది. సుత్తితో కొడుతూ ‘ఆర్డర్ ఆర్డర్.. విచారణ ప్రారంభించండి’ అనడంతో లాయర్లు అవాక్కయ్యారు.
కిందకు దిగేందుకు ఆమె ససేమిరా అనడంతో, మహిళా పోలీసులు కిందకు దించారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని గుర్తించిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Loading comments...



