Back to feed
జాక్వెలిన్ కేసు: తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి
Rohit Jun 11, 2026 12:23 PM అల్ ఇండియా 7 views4 days ago

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వైదొలిగారు. ఈ కేసు ప్రభుత్వ న్యాయబృందంలో తన కుమారుడు ఉన్నందున, పారదర్శకత కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
తనపై అభియోగాలు మోపాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ జాక్వెలిన్ సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా జడ్జి తప్పుకోవడంతో ఈ పిటిషన్ను వేరే ధర్మాసనం విచారించనుంది.
Comments
Loading comments...



