Back to feed
భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం: పుతిన్ కీలక వ్యాఖ్యలు
Ravi Shukla Jun 05, 2026 5:47 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

భారత్తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని ఆయన ప్రశంసించారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని, ఇతర దేశాలతో భారత్కు ఉన్న సంబంధాలు తమ మైత్రికి అడ్డంకి కావని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమ దేశాల ఒత్తిళ్లను భారత్ లెక్కచేయడం లేదని, ఇది గ్లోబల్ స్థిరత్వానికి అవసరమని పుతిన్ అన్నారు. విశ్వసనీయ భాగస్వామిగా భారత్తో ఆర్థిక, దౌత్య పరమైన బంధాన్ని మరింత విస్తరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...



