Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ముగ్గురు దుర్మరణం

Rahul Joshi Jun 04, 2026 4:49 AM అల్ ఇండియా 13 viewsabout 3 hours ago
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ముగ్గురు దుర్మరణం - Udayam Digital
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ ప్రసాద్‌ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఐదో అంతస్తులోని ఐసీయూలో షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటల్లో ముగ్గురు రోగులు సజీవ దహనమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 20 మందిని సురక్షితంగా తరలించారు. దట్టమైన పొగతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. క్షతగాత్రులను ఇతర ఆసుపత్రులకు తరలించగా, దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...