Back to feed
సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ కన్నుమూత
Priya Sethi Jun 04, 2026 7:25 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

ప్రముఖ నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ (76) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గుండెపోటుతో మరణించినట్లు FWICE అధ్యక్షుడు బి.ఎన్.తివారీ ధ్రువీకరించారు.
నిహలానీ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన సంతాపం తెలిపారు. ఆయన సినీ రంగానికి అందించిన సేవలను పలువురు సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.
Comments
Loading comments...



