Back to feed
ఘోర రోడ్డు ప్రమాదం లో 20 మంది ఏపీ ప్రయాణికులకు గాయాలు
Ravi Jun 14, 2026 3:03 AM అల్ ఇండియా 12 views1 day ago

బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. పామూరు నుండి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఏపీకి చెందిన 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమవగా, క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలంలో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...



