Back to feed
సీబీఎస్ఈ పోర్టల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు
Priya Jun 12, 2026 11:57 AM అల్ ఇండియా 30 views3 days ago

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్ పోర్టల్ను తిరిగి తెరవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ దశలో పోర్టల్ తెరిస్తే ఫలితాలు ఆలస్యమై లక్షలాది మంది విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది.
సాంకేతిక సమస్యల ఆరోపణలను సీబీఎస్ఈ ఖండించింది. నిర్ణీత గడువులోగా 1.6 లక్షల మంది విద్యార్థులు విజయవంతంగా దరఖాస్తు చేసుకున్నారని బోర్డు స్పష్టం చేసింది. తగిన కారణం ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా కోర్టును ఆశ్రయించవచ్చని న్యాయస్థానం సూచించింది.
Comments
Loading comments...



