Back to feed
గుడిమల్లం పరశురామేశ్వర స్వామి హుండీ ఆదాయం
Rakesh Jun 12, 2026 9:08 AM చిత్తూరు 8 views3 days ago

ఏర్పేడు మండలం గుడిమల్లంలోని చారిత్రాత్మక పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో 45 రోజుల హుండీ లెక్కింపును అధికారులు శనివారం నిర్వహించారు. భక్తులు తమ మొక్కుల రూపంలో సమర్పించిన కానుకలను ఆలయ ప్రాంగణంలో పారదర్శకంగా లెక్కించారు.
ఈ లెక్కింపులో సాధారణ హుండీల ద్వారా రూ.3,94,964 లభించగా, అన్నదాన హుండీ ద్వారా మరో రూ.20,019 ఆదాయం వచ్చింది. స్వామివారికి మొత్తంగా రూ.4,14,983 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

