వార్తలకు తిరిగి వెళ్లండి

ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడానికి ఆర్బీఐ 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందంటూ బ్లూమ్బెర్గ్ ప్రచురించిన కథనాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగం స్పష్టం చేసింది.
గణాంకాల ప్రకారం ఆర్బీఐ వద్ద బంగారం నిల్వల వాటా మరింత పెరిగిందని కేంద్రం తెలిపింది. ఆర్బీఐ తన ఫిజికల్ గోల్డ్ వివరాలను నెలవారీ బులెటిన్లో క్రమంతప్పకుండా వెల్లడిస్తుందని, అధికారిక సమాచారం కోసం వెబ్సైట్ను చూడాలని సూచించింది.
Comments
Loading comments...

