Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Sania Jun 15, 2026 4:55 AM అల్ ఇండియా 5 viewsabout 5 hours ago
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు - Udayam Digital
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,490కి చేరగా, కేజీ వెండి ధర రూ.2.57 లక్షలకు పెరిగింది. అంతర్జాతీయ డిమాండ్ పెరగడం వల్ల ఈ లోహాల ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. మరోవైపు, ఇరాన్‌తో అమెరికా డీల్ కుదుర్చుకోవడంతో ముడి చమురు ధరలు తగ్గాయి. రూపాయి విలువ కూడా 53 పైసలు బలపడి 93.65 వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధ వాతావరణం చల్లారినప్పటికీ, కమొడిటీ మార్కెట్‌లో పసిడి, వెండికి గిరాకీ మాత్రం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...