Back to feed
"జీహెచ్ఎంసీ టిప్పర్ బీభత్సం: ఇద్దరు దుర్మరణం"
Ravi Jun 15, 2026 5:14 AM హైదరాబాద్ 2 viewsabout 4 hours ago

హైదరాబాద్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఆటోను మరో ఆటోకు కట్టి లాగేందుకు ప్రయత్నిస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన జీహెచ్ఎంసీ గార్బేజ్ తిప్పర్ లారీ వీరిని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సంతోష్ (26) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీల్ (33) కన్నుమూశారు.
Comments
Loading comments...



