Back to feed
దసరాకు గన్నవరం కొత్త టెర్మినల్
Rohit Jun 17, 2026 5:56 AM విజయవాడ 18 viewsabout 5 hours ago

గన్నవరం విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పరిశీలించారు. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలతో ఈ టెర్మినల్ను దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా విమాన సేవలను విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, దేశానికే తలమానికంగా అభివృద్ధి చేస్తామని, అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...



