Back to feed
విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు
Rajdeep Jun 11, 2026 1:52 PM అమరావతి 12 views4 days ago

నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు 'స్వర్ణాంధ్ర @2047' విజన్ ప్లాన్ను సమర్పించారు. ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులను ప్రపంచస్థాయికి సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
సంతానోత్పత్తి రేటు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మానవ వనరుల కొరతను అధిగమించడానికి కొత్త 'పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ'ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అలాగే, 'ప్రాజెక్ట్ సంజీవని' ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను అమలు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Loading comments...

