Back to feed
భారత్కు చేరిన నాలుగో ఎస్-400 స్క్వాడ్రన్
Sonia Singh Jun 04, 2026 5:16 AM అల్ ఇండియా 10 viewsabout 3 hours ago

రష్యా నుంచి భారత్కు నాలుగో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్క్వాడ్రన్ విజయవంతంగా చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ సరఫరా కొంత ఆలస్యమైంది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా చివరిదైన ఐదో స్క్వాడ్రన్ వచ్చే ఏడాది భారత్కు అందే అవకాశం ఉందని రక్షణ అధికారులు వెల్లడించారు.
శత్రువుల ముప్పును ముందే పసిగట్టి, వ్యూహాత్మక నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు వీలుగా ఈ అధునాతన రక్షణ వ్యవస్థకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను జోడించనున్నారు. ఇది భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.
Comments
Loading comments...



