Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కూటమి ఖాతాలోకి 4 రాజ్యసభ స్థానాలు

Sonia Singh Jun 11, 2026 10:49 AM అమరావతి 6 views4 days ago
కూటమి ఖాతాలోకి 4 రాజ్యసభ స్థానాలు - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కూటమి తరఫున బరిలో నిలిచిన ముగ్గురు టీడీపీ అభ్యర్థులు, ఒక జనసేన అభ్యర్థి మాత్రమే నామినేషన్లు వేయడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణ, సానా సతీష్‌, చింతకాయల విజయ్‌, అలాగే జనసేన తరఫున లింగమనేని రమేష్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. పరిమితికి మించి వేరే ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఈ ప్రక్రియ ఏకగ్రీవంగా ముగిసింది.

Comments

G
Loading comments...