వార్తలకు తిరిగి వెళ్లండి
ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం

అరుణాచల్, అస్సాం రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల జనజీవనం స్తంభించింది. కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అరుణాచల్లో ఐదుగురు గల్లంతు కాగా, వాయుసేన సహాయంతో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అస్సాంలో 45 వేల మంది వరద చిక్కుల్లో ఉన్నారు. పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేసి, బాధితులకు తక్షణ సాయం అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...