Back to feed
ఎవరెస్ట్ శిఖరాగ్రాన జెమినీ గణేశన్ మనవరాలు
Priya Dasgupta Jun 10, 2026 6:33 PM అల్ ఇండియా 9 views5 days ago

దివంగత నటుడు జెమినీ గణేశన్ మనవరాలు, చెన్నై వైద్యురాలు డాక్టర్ ప్రియా సెల్వరాజ్(52) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అరుదైన రికార్డు సృష్టించారు. ఏడు నెలల్లోనే ఎనిమిది వేల మీటర్ల ఎత్తైన రెండు శిఖరాలను (ఎవరెస్ట్, మానస్లు) అధిరోహించిన 50 ఏళ్లు దాటిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కారు.
రోజుకు 12-13 గంటలు శ్రమించి ఎనిమిది రోజుల్లోనే ఎవరెస్ట్ను చేరుకున్నట్లు ఆమె తెలిపారు. ఫోన్లకు పరిమితమవకుండా యువత వ్యాయామం చేయాలని సూచించారు.
Comments
Loading comments...



