Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఉద్యోగులకు శనివారాలు సెలవు

Ravi Varma Jun 12, 2026 7:35 AM అల్ ఇండియా 6 views3 days ago
ఉద్యోగులకు శనివారాలు సెలవు - Udayam Digital
ప్రభుత్వ ఉద్యోగులకు త్రిపుర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పెంచేందుకు గాను ఇకపై అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవు ఉండేది. వారానికి ఒక రోజు సెలవు పెరిగినందున, రోజువారీ ఆఫీస్ పనివేళలను పొడిగించారు. ఇకపై ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...