Back to feed
ఉద్యోగులకు శనివారాలు సెలవు
Ravi Varma Jun 12, 2026 7:35 AM అల్ ఇండియా 6 views3 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు త్రిపుర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పెంచేందుకు గాను ఇకపై అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవు ఉండేది.
వారానికి ఒక రోజు సెలవు పెరిగినందున, రోజువారీ ఆఫీస్ పనివేళలను పొడిగించారు. ఇకపై ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...



