వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గురువారం ఉదయం 6 గంటలకు 145.85 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 14.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టులోకి 4,414 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, హెచ్ఎండబ్ల్యూఎస్కు 275 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గేట్లు ఎత్తివేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

