Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దకండి: మల్లు రవి వార్నింగ్

Sonia Jun 18, 2026 12:14 PM హైదరాబాద్ 10 viewsabout 3 hours ago
వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దకండి: మల్లు రవి వార్నింగ్ - Udayam Digital
నేతలు వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దవద్దని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సూచించారు. సమస్యలుంటే టీపీసీసీ చీఫ్ లేదా పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి ఘటనపై షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేశామని, ఆదివారం విచారణ ఉంటుందని వెల్లడించారు. పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుందని మల్లు రవి హెచ్చరించారు.

Comments

G
Loading comments...