Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తిరుమలలో భక్తుడి మృతి

Vikranth Jun 12, 2026 6:49 AM తిరుపతి 12 views3 days ago
తిరుమలలో భక్తుడి మృతి - Udayam Digital
అనంతపురం జిల్లా మేడాపురం గ్రామానికి చెందిన గాండ్ల పెద్దన్న (48) తిరుమలలో గుండెపోటుతో మరణించారు. తన కుమారుడికి ఉద్యోగం రావడంతో, మొక్కు చెల్లించుకునేందుకు ఆయన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. శుక్రవారం ఉదయం వారు బస చేసిన గదిలో పెద్దన్నకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన కన్నుమూశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Comments

G
Loading comments...