Back to feed
శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ
Vikram Chandra Jun 13, 2026 5:08 AM చిత్తూరు 8 views2 days ago
దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శని త్రయోదశి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన భారీ సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామి అభిషేక పూజల్లో పాల్గొని, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీరు తదితర అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించారు.
Comments
Loading comments...

