Back to feed
యూపీలో ఈదురు గాలుల బీభత్సం: 104 మంది మృతి
Ravi Shukla May 15, 2026 5:14 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

ఉత్తరప్రదేశ్లో వీచిన భారీ ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా 31 జిల్లాల్లో 104 మంది మృతి చెందారు. ఒక్క ప్రయాగ్రాజ్లోనే 21 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. గాలి తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
బరేలీలో ఓ యువకుడు ఇనుపరేకుతో సహా గాల్లోకి ఎగిరి పడిపోవడం గాలుల తీవ్రతకు అద్దం పడుతోంది. వందలాది పశువులు మరణించగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది.
Comments
Loading comments...



