Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

హౌసింగ్‌లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Sai Teja Jun 15, 2026 6:18 AM కడప 3 viewsabout 4 hours ago
ప్రొద్దుటూరు జగనన్న కాలనీల భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, బిల్లుల చెల్లింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్ల ఎంపిక, డ్వాక్రా మహిళల నుంచి వసూళ్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అవినీతిపై నిజానిజాలు బయటపడాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తో విచారణ జరపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...