Back to feed
సీబీఎస్ఈ కొత్త ఛైర్మన్గా ప్రశాంత్ సీతారామ్
Ravi Shukla Jun 03, 2026 6:09 AM అల్ ఇండియా 8 viewsabout 18 hours ago

డిజిటల్ మూల్యాంకన వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ సీబీఎస్ఈ నూతన ఛైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారామ్ను నియమించింది. అలాగే బోర్డు నూతన కార్యదర్శిగా ఐఐఎస్ అధికారి వరుణ్ భరద్వాజ్కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో అవకతవకల ఆరోపణల కారణంగా మునుపటి అధికారులను బదిలీ చేశారు. ఈ మొత్తం వివాదంపై విచారణ జరిపి నెల రోజుల్లోగా నివేదిక సమర్పించేందుకు వీలుగా ఎస్.రాధా చౌహాన్ నేతృత్వంలో కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
Comments
Loading comments...


