Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

Rohit Kumar Jun 11, 2026 6:10 AM కర్నూలు 7 views4 days ago
విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి - Udayam Digital
కర్నూలు జిల్లా బైలుప్పల గ్రామంలో గురువారం విషాద ఘటన జరిగింది. ఆడుకుంటూ కరెంట్ హీటర్ ఆన్ చేసి ఉన్న నీటి బకెట్‌లో చేయి పెట్టడంతో ఐదేళ్ల రిషి అనే బాలుడు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ చిన్నారిని నరేశ్ అనే వ్యక్తి నుండి అతని తోడల్లుడు రాజు దత్తత తీసుకుని పెంచుతున్నాడు. ఊహించని ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Comments

G
Loading comments...