Back to feed
కృష్ణా నదిలో పడవ బోల్తా
Sunil Jun 14, 2026 1:44 PM పల్నాడు జిల్లా 23 viewsabout 20 hours ago

పల్నాడు జిల్లా కోనూరు కృష్ణా నదిలో పడవ బోల్తా పడి చైతన్య(28)తో పాటు ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఒక వేడుకకు హాజరై తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.
పడవలోని పది మందిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు. గల్లంతైన నలుగురి మృతదేహాలను పోలీసులు, స్థానికులు గాలించి వెలికితీశారు.
Comments
Loading comments...

