Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బెట్వా నది వంతెన కూలికపై యూపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ

Rohit Singh Jun 02, 2026 7:17 AM అల్ ఇండియా 20 views1 day ago
బెట్వా నది వంతెన కూలికపై యూపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ - Udayam Digital
ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న బెట్వా నది వంతెన కూలి ఆరుగురు మరణించిన ఘటనపై యోగి ప్రభుత్వం రెండు ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం, యూపీ బ్రిడ్జ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఈ కమిటీలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయి. అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సాంకేతిక, పరిపాలనా లోపాలను పరిశీలిస్తోంది. మరో సాంకేతిక కమిటీ వంతెన డిజైన్, నిర్మాణ నాణ్యత, వాడిన మెటీరియల్స్ మరియు భద్రతా ప్రమాణాలపై ల్యాబ్ పరీక్షల ద్వారా నివేదిక ఇవ్వనుంది.

Comments

G
Loading comments...