Back to feed
మే 15న విచారణకు హాజరవుతా: సిట్కు బండి భగీరథ్ మెయిల్
Vikram Sharma May 13, 2026 12:55 PM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసు విచారణకు సంబంధించి పోలీసులకు ఈ-మెయిల్ పంపారు. మే 15న సిట్ ముందు విచారణకు హాజరవుతానని, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.
నిజానిజాలు నిలకడగా బయటకు వస్తాయని భగీరథ్ ధీమా వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...



