Back to feed
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ: ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్!
Vikram Sharma Jun 14, 2026 9:29 AM అల్ ఇండియా 29 views1 day ago

అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నెలకు కేవలం రూ.20 వేల లోపు జీతం పొందే వీరు ఏకంగా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారు.
నివేదికల ప్రకారం వారు రూ.40 లక్షల నుండి రూ.1.5 కోట్ల విలువైన ఖరీదైన ప్లాట్లను కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక ఆలయ ఉద్యోగి ఇంట రూ.10 లక్షల అక్రమ నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



