Back to feed
సైబర్ భద్రతపై నంద్యాల శక్తి టీం అవగాహన
Ravi Sharma Jun 12, 2026 7:20 AM నంద్యాల 6 views3 days ago

నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది ఎమ్మెస్ నగర్లోని పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన కల్పించారు. అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆపద సమయంలో శక్తి యాప్ వాడాలని, సైబర్ నేరాలకు 1930, బాల్యవివాహాలు, వేధింపులపై 1098, అత్యవసర సహాయం కోసం 100, 112 నంబర్లను సంప్రదించాలని విద్యార్థినులకు సూచించారు.
Comments
Loading comments...

