Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాం సరిహద్దులో తప్పిన ముప్పు

విక్రాంత్ రెడ్డి Jun 30, 2026 5:41 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
అస్సాం సరిహద్దులో తప్పిన ముప్పు - Udayam Digital
అస్సాం–నాగాలాండ్ సరిహద్దులోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టుపై గుర్తుతెలియని దుండగులు గ్రెనేడ్ విసిరారు. అయితే అది పేలకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు మంగళవారం ప్రకటించారు. ధన్సిరి ప్రాంతంలోని రంగఫార్ సైడింగ్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పేలుడు సంభవించకపోవడంతో కార్మికులు సురక్షితంగా బయటపడ్డారని, రైల్వే మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని భద్రతా దళాలు స్పష్టం చేశాయి.

Comments

G
Loading comments...