వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి నది కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్రా పేపర్ మిల్స్కు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. నదిలో ప్రమాదకర రసాయనాలు కలుస్తున్నట్లు ల్యాబ్ నివేదికల్లో తేలడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో పర్యవేక్షణ లోపించినందుకు రాజమహేంద్రవరం కార్పొరేషన్కు కూడా నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు.
Comments
Loading comments...

