వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ వల్ల ఐటీ సంస్థలకు ముప్పు లేదని, అది వాటి సామర్థ్యాన్ని పెంచుతుందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. 2030 నాటికి 400 బిలియన్ డాలర్ల ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు.
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఇన్ఫోసిస్ ముందుందని, 90 శాతం కీలక క్లయింట్లకు ఏఐ సేవలందిస్తున్నామని తెలిపారు. ఏఐ విప్లవంలో సంస్థ మరింత వృద్ధిని సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

