Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

Ravi Jun 13, 2026 1:12 AM తిరుపతి 15 views2 days ago
శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు - Udayam Digital
వారాంతం కావడంతో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, భక్తుల క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వరకు సాగాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుందని తితిదే పేర్కొంది. గురువారం రోజున 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, తిరుమలలో ప్రస్తుతం తరచూ వర్షపు జల్లులు కురుస్తున్నాయి.

Comments

G
Loading comments...