Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మధ్యప్రదేశ్‌లో బ్యాంకులో భారీ చోరీ; 20 నిమిషాల్లో నగదు, నగలతో పరారైన దుండగులు.

Udayam Digital Staff Apr 18, 2026 7:08 AM అల్ ఇండియా 13 views21 days ago
మధ్యప్రదేశ్‌లో బ్యాంకులో భారీ చోరీ; 20 నిమిషాల్లో నగదు, నగలతో పరారైన దుండగులు. - Udayam Digital
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో భారీ చోరీ జరిగింది. ఐదుగురు సాయుధులు వినియోగదారుల రూపంలో బ్యాంకులోకి ప్రవేశించి, సిబ్బందిని తుపాకులతో బెదిరించి 20 నిమిషాల్లోనే రూ.35 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యారు. బ్యాంక్ మేనేజర్‌పై దాడి చేసి లాకర్ తాళాలు లాక్కోవడమే కాకుండా, గాల్లోకి కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...