Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బెంగాల్ విభజనపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు; తనను దించేందుకు వెయ్యి కోట్ల కుట్ర జరుగుతోందని వెల్లడి.

Udayam Digital Staff Apr 13, 2026 9:13 AM అల్ ఇండియా 8 views26 days ago
బెంగాల్ విభజనపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు; తనను దించేందుకు వెయ్యి కోట్ల కుట్ర జరుగుతోందని వెల్లడి. - Udayam Digital
పశ్చిమ బెంగాల్‌ను మూడు ముక్కలుగా విభజించి పక్క రాష్ట్రాల్లో కలపాలని బీజేపీ కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపించారు. తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.1,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుందని ఎన్నికల ర్యాలీలో ఆమె మండిపడ్డారు. మైనారిటీ ఓట్లను చీల్చేందుకు ఇతర పార్టీలతో కలిసి కుట్రలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూలిపోవడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ బంధువు చంద్రబోస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.

Comments

G
Loading comments...