వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శాలిబండకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సురీందర్ సింగ్ జమ్మూ కాశ్మీర్లో విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్ జిల్లాలో విధుల్లో ఉండగా ఆయన ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆయన మృతిని ధ్రువీకరించగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశ సేవలో ఉన్న జవాన్ అకస్మాత్తుగా మరణించడంతో శాలిబండలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

