వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ముందే గుర్తించినా ఎందుకు స్పందించలేదని అధికారులను ప్రశ్నించారు. సోమవారానికల్లా బంకుల్లో నిల్వలు పెంచి, 'నో స్టాక్' బోర్డులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
పాపిక్ బయింగ్, ప్రైవేట్ సరఫరా నిలిపివేత వల్ల సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా చూస్తూ, ఈ సంక్షోభంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
Comments
Loading comments...

