Back to feed
భారత్లో ర్యాడిసన్ భారీ విస్తరణ: 2030 కల్లా 80 వేల ఉద్యోగాల కల్పన!
Udayam Digital Staff Apr 21, 2026 7:26 AM అల్ ఇండియా 8 views18 days ago

ర్యాడిసన్ హోటల్ గ్రూప్ భారత్లో భారీ విస్తరణకు సిద్ధమైంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా తన హోటళ్ల సంఖ్యను 500కు చేర్చనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 200 హోటళ్లు కలిగి ఉన్న ఈ సంస్థ, ఈ విస్తరణ ద్వారా దాదాపు 65 వేల నుంచి 80 వేల మందికి ఉపాధి కల్పించనుంది.
టైర్-1, టైర్-2 నగరాలతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాల్లోనూ కొత్త హోటళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఐదు స్టార్ల నుంచి సాధారణ హోటళ్ల వరకు విభిన్న శ్రేణుల్లో వీటిని నిర్మిస్తామని సంస్థ గ్లోబల్ చీఫ్ ఎలీ యూనస్ తెలిపారు.
Comments
Loading comments...



