Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఫేక్ ఫోన్ పే యాప్‌తో రూ. 20 వేల మోసం: ఇద్దరు అరెస్ట్

Udayam Digital Staff Apr 23, 2026 8:49 AM హైదరాబాద్ 2 views16 days ago
ఫేక్ ఫోన్ పే యాప్‌తో రూ. 20 వేల మోసం: ఇద్దరు అరెస్ట్ - Udayam Digital
ఫేక్ ఫోన్ పే యాప్‌తో నకిలీ లావాదేవీలు చూపుతూ మోసాలకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యవసరమని నమ్మించి రూ. 20 వేలు తీసుకున్న నిందితులు, నకిలీ యాప్ ద్వారా నగదు బదిలీ చేసినట్లు స్క్రీన్ షాట్ చూపించి బాధితుడు వహీమ్ అహ్మద్ ఖాన్‌ను బురిడీ కొట్టించారు. డబ్బులు అకౌంట్‌కు జమ కాకపోవడంతో బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు, వాహన నంబర్ ఆధారంగా మహమ్మద్ మక్తదర్ రెహమాన్, మహ్మద్ అకిఫ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...