Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ధోనీని దాటేసిన పంత్‌

Follow Udayam on Google
Sai Aug 24, 2026 12:55 PM జాతీయంక్రీడలు
ధోనీని దాటేసిన పంత్‌ - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో రిషభ్‌ పంత్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. విదేశీ, తటస్థ టెస్టుల్లో వికెట్‌కీపర్‌గా భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఎంఎస్‌ ధోనీని అధిగమించాడు. పంత్‌ 2,501 పరుగులు చేయగా, ధోనీ 2,496 పరుగులతో ఉన్నాడు. తొలి రోజు చేతికి గాయం కావడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్‌.. రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ధ్రువ్‌ జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
Read original source

Comments

G
Loading comments...