వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం దేవాలయంలో శని, ఆదివారాల్లో జరిగే స్వర్ణ పుష్పార్చన కారణంగా అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో వెంకటరావు తెలిపారు. ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తులకు అంతరాలయ దర్శనం లభించదు.
ఈ ప్రత్యేక పూజల అనంతరం రద్దీని బట్టి తదుపరి దర్శనాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని దేవస్థానం కోరింది.
Comments
Loading comments...

