Back to feed
పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం బంధువు అస్థికలు కలపడానికి వెళ్తుండగా 8 మంది మృతి!
Ravi Joshi Jun 06, 2026 9:23 AM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago

పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫాజిల్కా రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల మరణించిన తమ బంధువు అస్థికలను బియాస్లో కలిపేందుకు మహీంద్రా పికప్ వాహనంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 25 మంది జలాలాబాద్ వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Comments
Loading comments...

