Back to feed
ఒడిశాలో ఘోర ప్రమాదం: ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
Vikram Jun 16, 2026 10:03 AM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago

ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్రక్కుల్లోని ఇద్దరు డ్రైవర్లు సజీవదహనమయ్యారు. డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం పది నెంబర్ జాతీయ రహదారిపై జరగడంతో ట్రాఫిక్కు కొంతసేపు అంతరాయం కలిగింది.
Comments
Loading comments...



