వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి కేంద్రం తీపి కబురు అందించింది. 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన' కింద ఉద్యోగులకు రూ.15 వేలు, కంపెనీలకు రూ.3 వేల ఆర్థిక సాయాన్ని రేపు ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తొలి విడతగా రూ.2,400 కోట్లు కేటాయించనున్నారు.
2025లో ప్రారంభమైన ఈ పథకం జూలై 2027 వరకు కొనసాగుతుంది. ఈ ప్రోత్సాహకాలు యువతకు, సంస్థలకు పెద్ద ఊరటనివ్వనున్నాయి.
Comments
Loading comments...

