Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మున్సిపల్ కార్మికుల నిరసన: రూ.26 వేల వేతనం కోసం డిమాండ్

Anusha Jun 18, 2026 10:32 AM కరీంనగర్ 1 viewsabout 2 hours ago
మున్సిపల్ కార్మికుల నిరసన: రూ.26 వేల వేతనం కోసం డిమాండ్ - Udayam Digital
వేములవాడలో మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రతి కార్మికుడికి రూ.26 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు దాటిన కార్మికుల వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...